Thursday, May 9, 2024

Venkaiah Naidu: పద్మ‌విభూష‌ణ‌ల‌కు ప్ర‌భుత్వ స‌త్కారం ….

పద్మ విభూషణ్ గ్రహీతలు వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిల‌ను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ముందుగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని వెంక‌య్య నాయుడి నివాసానికి వెళ్లి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు చెప్పి దుశ్శాలువ క‌ప్పి స‌న్మానించారు. అలాగే ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవినీ జూపల్లి కలిశారు.

అనంతరం శుభాకాంక్షలు చెప్పి శాలువాతో సత్కరించారు. ఇదే సంద‌ర్భంగా ఈ నెల 4వ తేదీన పద్మ పురస్కార విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మాన కార్యక్రమం ఉంటుందని దానికి తప్పక హాజరు కావాలని వెంకయ్య, చిరంజీవిల‌ను ఆహ్వానించారు. కాగా, పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్‌ చిరంజీవి, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోమ్‌లాల్‌, శిల్పకారుడు స్తపతి ఆనందాచారిని రాష్ట్ర ప్రభుత్వం నాలుగో తేదిన హైద‌రాబాద్ లో ఘనంగా సత్కరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement