Sunday, May 5, 2024

Good News – ఆర్జీవీ ‘వ్యూహం’ మూవీ విడుద‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ..

దర్శకుడు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన మరోసారి పరిశీలించాక సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలతో మరోసారి ఈ సినిమా సెన్సార్ బోర్డు రివ్యూ చేసి పలు సూచనలు ఇచ్చింది. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా తొలగించి కొత్త రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. దీనిని అమోదించిన హైకోర్టు ఈ మూవీని విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని అదేశాలు జారీ చేసింది.. దీంతో వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement