Tuesday, May 14, 2024

రిలయన్స్‌ ఉద్యోగులకు శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ వెహికల్‌ ఛార్జింగ్‌..

దేశంలోని వాణిజ్య దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ యజమాని ముఖేష్‌ అంబానీ తన ఉద్యోగులకు శుభవార్తను అందించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన ముంబై క్యాంపస్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్‌ ఉద్యోగులు తమ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఈ ప్రాంగణంలో ఉచితంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌, నవీ ముంబై క్యాంపస్‌లో ఛార్జింగ్‌ జోన్‌ గురించి తెలియజేస్తూ కంపెనీ తన ఉద్యోగులకు ఇమెయిల్‌ పంపింది.రిలయన్స్‌ ఇతర క్యాంపస్‌లలో కూడా ఇలాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. రిలయన్స్‌ ఉద్యోగులు తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉచితంగా ఛార్జ్‌ చేయడానికి పల్స్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లోని జియోబ్ఖిపి పల్స్‌ జోన్‌ ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ఫోర్‌ వీలర్ల కోసం వివిధ కాన్ఫిగరేషన్‌ల ఆరు ఛార్జర్‌లను కలిగి ఉంది. ఉద్యోగులు తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉచితంగా ఛార్జ్‌ చేయడానికి మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్‌ సెషన్‌ను ప్రారంభించడానికి, ఛార్జింగ్‌ యూనిట్‌లోని కోడ్‌ను స్కాన్‌ చేయాలి. 2021లో దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్‌ హబ్‌లో ఒకదానిని ఢిల్లిలోని ద్వారకలో నిర్మించి, దాని ప్రాథమిక కస్టమర్‌గా బ్లూస్మార్ట్‌తో ప్రారంభించింది.

ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది. ఛార్జింగ్‌ సమస్యను అధిగమించడానికి రెండో దశ కింద దేశంలోని 16 హైవేలు, 9ఎక్స్‌ప్రెస్‌వేలపై 1576ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైవేకి ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంలో కనీసం ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 100 కి.మీ దూరంలో హైవేకి ఇరువైపులా లాంగ్‌ రేంజ్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022 బడ్జెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడానికి ఛార్జింగ్‌ స్టేషన్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement