Monday, April 29, 2024

AP | ఏపీ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్‌.. ఒంటిపూట క్లాసుల‌ను పొడిగించిన ప్ర‌భుత్వం

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట త‌ర‌గ‌తుల‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇవ్వాల (సోమ‌వారం) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విష‌యాన్ని పాఠశాల విద్యాశాఖ‌ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఈ సూచనలను పాటించాలని తెలిపారు.

ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సూచించారు. రాగిజావను ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్న భోజనం 11:30 నుంచి 12 గంటల వరకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement