Thursday, April 25, 2024

ఘ‌నంగా రాకేశ్.. సుజాత‌ల నిశ్చితార్థం.. మంత్రి రోజాతో స‌హా హాజ‌రైన సెలబ్రిటీస్

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ రాకింగ్ రాకేశ్..జోర్దార్ సుజాత‌ల నిశ్చితార్థం వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి పాత జబర్దస్త్ టీం కూడా హాజరయ్యి సందడి చేశారు. జబర్దస్త్ లవ్ జోడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఈనెల చివరిలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. కానీ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇరువైపు పెద్దలు ఇప్పటికే మాట్లాడుకున్నారని నిశ్చితార్థం కూడా చేసుకునే రోజే లగ్న పత్రిక కూడా రాసుకోబోతున్నట్లు జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపింది. అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకొని లగ్నపత్రిక కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. రాకింగ్ రాకేష్ , జోర్దార్ సుజాత నిశ్చితార్థానికి జబర్దస్త్ మాజీ, తాజా టీమ్ మెంబర్లు కూడా హాజరయ్యారు. అంతే కాదు గతంలో జబర్దస్త్ కి జడ్జిగా వ్యవహరించిన ఏపీ మంత్రి రోజా కూడా ఈ నిశ్చితార్ధానికి హాజరయ్యారు. అలాగే యాంకర్లు అనసూయ భరద్వాజ్, గెటప్ శ్రీను ,రవి తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement