Thursday, April 18, 2024

రేపు విశాఖకు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 28న ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి విశాఖకు బయలుదేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి.సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వంచనున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద గల విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ నివాసానికి సీఎఎం జగన్ వెళతారు. ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో సీఎం జగన్ ఆశీర్వదిస్తారు. అనంతరం విశాఖ పర్యటనను ముగించుకుని సీఎం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement