Monday, April 29, 2024

జూనియర్ ఎన్టీఆర్ షో ఎఫెక్ట్.. పెరిగిన జెమినీ టీవీ రేటింగ్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఇటీవల జెమినీ టీవీలో ప్రారంభమైంది. తారక్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నట్లు వార్తలు రాగానే ఈ షోపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. దీంతో అందరూ భావించినట్లుగానే ఈ షో టీఆర్పీ రేటింగుల్లో దుమ్మురేపింది. తారక్ ఎఫెక్ట్ కారణంగా జెమినీ టీవీ రేటింగులు పెరిగాయి

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో 11.4 రేటింగ్ వచ్చింది. దీంతో జెమిని టీవీ రేటింగ్ 290 జీఆర్పీ నుంచి 400 జీఆర్పీకి వెళ్లింది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తొలి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా… నాలుగో సీజన్‌కు చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మొదటి సీజన్‌కు 9.70, రెండో సీజన్‌లో 8.20, మూడో సీజన్‌లో 6.72, మెగాస్టార్ చిరంజీవి నడిపించిన నాలుగో సీజన్‌లో 3.62 రేటింగ్ మాత్రమే దక్కింది. దీంతో తారక్ పేరిట ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదైంది.

ఈ వార్త కూడా చదవండి: భీమ్లా నాయక్‌ పాటపై తెలంగాణ పోలీసుల ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement