Wednesday, April 24, 2024

ఈనెల 7న టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ సమావేశం

ఈ నెల 7న హైద‌రాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌ల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశం టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌ల‌విహార్‌లో జ‌ర‌గ‌నుంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో టీఆర్ఎస్ సంస్థాగ‌త క‌మిటీల ఏర్పాటుపై చ‌ర్చించ‌నున్నారు.

డివిజ‌న్ క‌మిటీల‌తో పాటు బ‌స్తీ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. గ్రామ‌, ప‌ట్ట‌ణ స్థాయిలో ఇప్ప‌టికే క‌మిటీల ఏర్పాటు ప్రారంభ‌మైంది. పార్టీ యొక్క నియామ‌వ‌ళి ప్ర‌కారం.. క‌మిటీల ఏర్పాటులో క్రియాశీల స‌భ్యుల‌ను ఎంపిక చేస్తారు. 51 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌నున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కాంగ్రెస్ పరువు తీసేది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement