Saturday, May 4, 2024

గౌత‌మ్ అదానీ 60వ పుట్టిన‌రోజు-విరాళంగా రూ.60వేల కోట్లు

అదానీ గ్రూపు అధినేత‌.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానీ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60,000 కోట్లను సమాజ సేవకు ఇస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబంతో కలసి రూ.60 వేల కోట్ల మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ కు బదలాయించనున్నారు. అదానీ ఫౌండేషన్ ఈ నిధులను ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై ఖర్చు చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవల కోసం నిధులు వెచ్చించనుంది. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ 100వ జయంతి ఈ ఏడాదే. ఇదే ఏడాది తన 60వ పుట్టిన రోజు అయినందున సమాజ సేవ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌతమ్ అదానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ భారత్ నుంచి అత్యంత సంపన్నులుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement