Wednesday, May 1, 2024

కోటిన్నర విలువైన గంజాయి స్వాధీనం..పోలీసుల అదుపులో నిందితులు..

కాకినాడ : ఫర్నీచర్ మాటున గంజాయి అక్రమ రవాణాకు తెర తీశారు దుండ‌గులు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స‌మాచారం మేర‌కు తాము వారిని అదుపులోకి తీసుకున్నామ‌ని జిల్లా ఎస్ పి ఎం. రవీంద్రనాథ్ బాబు తెలిపారు.జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన గౌరవ రాణా ,నౌశద్ ,ఆరిఫ్ లను అరెస్ట్ చేసి పదిహేను వందల కేజీల, కోటిన్నర విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ తూర్పు సరిహద్దుల్లో ఫర్నిచర్ వ్యాన్ లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామ‌న్నారు. వారిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement