Sunday, May 5, 2024

బాలోత్సవ్ 2021 ప్రారంభించిన కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్

బాలోత్స‌వ్ 2021రు కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ నివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని చిల్డ్రన్స్ డే గా జ‌రుపుకోవ‌డం ఆనంద‌దాయ‌క‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా పిల్ల‌లంద‌రికి ఉల్లాసం, ఉత్సాహం తో పాటు విద్య,క్రీడలు,సైన్స్ తదితర అంశాలపై అవగాహన కలిగించే స్టాల్స్ ఏర్పాటు చేసిన‌ట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చిన పిల్ల‌ల‌కు బ‌హుమ‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఇది కేవ‌లం వారిలోని ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి మాత్ర‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement