Saturday, May 4, 2024

ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చటంతో వెలుగులోకి..

మహబూబాబాద్: ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు మైనర్లు, ఓ మేజర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వల్ల బాలిక గర్భం దాల్చటంతో అసలు విషయం బయటపడింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే ప్రభుత్వ విద్యాసంస్థలో ఆరవ తరగతిలో ప్రవేశం పొందింది. బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఓ వ్యక్తి కలిసి కొద్ది నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని మహబూబాబాద్​లోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ విషయంపై నెల్లికుదురు పోలీసులను వివరణ కోరగా విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement