Sunday, May 5, 2024

ఓటీటీలో ‘గాండీవధారి అర్జున’.. డేట్ ఫిక్స్ !

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటించింది. ఇక‌, టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. కాగా, ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. మరో రెండు రోజుల్లో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రానుంది ఈ మూవీ. ఈ సినిమా సెప్టెంబర్ 24న మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. థియేటర్స్‌లో డిజాస్ట‌ర్ గా నిలిచిన‌ ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో చూడాలి

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement