Wednesday, May 15, 2024

బైబ్యాక్‌కు గెయిల్‌ గ్రీన్‌సిగ్నల్‌..

యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్‌ ఇండియా బోర్డు సొంత ఈక్విటీషేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.గురువారం సమావేశమైన బోర్డు పెయిడప్‌ ఈక్విటీలో 2.5శాతం వాటాను బైబ్యాక్‌ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్‌ పేర్కొంది. షేరుకి రూ.190 ధర మించకుండా 5.7కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ.1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్‌ ధర ఎన్‌ఎస్‌ఈలో ముగింపు ధరతో పోలిస్తే 24శాతం అధికంకావడం గమనార్హం. కాగా గతంలోనూ గెయిల్‌ 2020-21లో షేరుకి రూ.150 ధరలో రూ.1,046కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది.ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది.

గత బైబ్యాక్‌లో ప్రభుత్వవాటాకు రూ.747 కోట్లు లభించింది. 2021-22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్‌ కింద రికార్డుస్థాయిలో రూ.3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్‌ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌ షేరు 2శాతం పుంజుకుని రూ.156 వద్ద ముగిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement