కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ రోజు (బుధవారం) ఆగస్టు 5 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా-రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలకు ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్తర్వును భారత పురావస్తు శాఖ ఆమోదించింది. “As part of ‘Azadi ka Amrit Mahotsav’ and 75th I-Day celebrations, @ASIGoI has made entry free for visitors/ tourists to all its protected monuments/sites across the country, from 5th-15th August, 2022,” అని కేంద్ర సాంస్కృతిక మంత్రి జి కిషన్రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.