Thursday, April 25, 2024

టార్గెట్ మంచిర్యాల… పాఠశాలలో 14 మందికి కరోనా

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభిస్తుంది. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ మహమ్మారి కలకలం రేపింది. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 11 మంది టీచర్లు , ఇద్దరు వంట మనుషులు , ఒక విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో తల్లిదండ్రులు , ఉపాధ్యాయునిలు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా ప్రతి రోజు పాఠశాలకు 310 మంది విద్యార్థినులు హాజరవుతారు. మరోవైపు వారం రోజుల క్రితం గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. కరోనా విజృంభణ ఎక్కువ అవుతున్న తరుణంలో అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement