Wednesday, May 1, 2024

Odisha : నదిలో మునిగి నలుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి

నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటన ధాబలహర్ ప్రాంతంలోని బలియంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విద్యార్థులు స్నానం చేసేందుకు దిగి మునిగిపోతుండగా.. గమనించిన స్థానికులు కేకలు వేశారు. వెంటనే కొంత మంది ఈతగాళ్లు నదిలోకి దూకి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఇద్దరి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. చనిపోయిన వారిని ఆర్యన్ మిశ్రా, కుమార్ అభినాష్, రోహిత్ పరిదా, ప్రతీక్‌లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement