Sunday, May 5, 2024

మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒకరు మృతి.. మరొక్కరి పరిస్థితి విషమం

కుప్పం, (ప్రభ న్యూస్) : ఏపీలోని చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఇవ్వాల యాక్సిడెంట్ చేశారు. తన సొంత కారులో వెళ్తుండ‌గా రోడ్డుపై ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మ‌రొక‌రి పరిస్థితి విషమంగా ఉంది.

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండిశెట్టి పల్లి రోడ్డుపై శనివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన‌ మునెప్ప (65), లక్ష్మమ్మ (55) దంపతులు బైకు మీద వెళ్తుండగా మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు యాక్సిడెంట్ చేశాడు. దీంతో మునెప్ప చ‌నిపోగా, లక్ష్మమ్మకు తీవ్ర గాయాల‌య్యాయి. దీనిపో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement