Wednesday, May 1, 2024

రేపటి నుంచి ఏపీ పీజీఈసెట్‌- 2022..

అమరావతి, ఆంధ్రప్రభ: ఎంటెక్‌, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీఈసెట్‌- 2022 పరీక్షలు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరగనున్నట్లు కన్వీనర్‌ ప్రొ. ఆర్వీఎస్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి తరఫున శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెట్‌ నిర్వహిస్తున్నామని, ప్రవేశ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

18వ తేదీ నుంచి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 కేంద్రాలలో పరీక్ష జరుగుతుందని, అందుకోసం పరిశీలకులను నియమించామని, విద్యార్థులు గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కన్వీనర్‌ ప్రొ. ఆర్వీఎస్‌ సత్యనారాయణ సూచించారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement