Tuesday, April 30, 2024

బీజేపీ సునీల్ బన్సల్‌తో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ భేటీ
తెలంగాణ రాజకీయాలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్ సునీల్ బన్సల్‌తో మాజీ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలపై ఇరువురు చర్చించారు. దీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసు అధికారిగా సేవలందించిన కృష్ణప్రసాద్ ఇటీవల జరిగిన మునుగోడు సభలో బీజేపీలో చేరారు. గురువారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సునీల్ బన్సల్‌ను ఆయన కలిశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చలు జరిపారు. అర్థగంట పాటు జరిగిన భేటీలో ముఖ్యంగా యువత, ఉపాధి కల్పన, అవగాహన కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, శాంతిభద్రతలు, తదితర అంశాలపై మంతనాలు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement