Friday, May 3, 2024

వైద్యం వికటించి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి మృతి

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా చెన్నయ్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి చనిపోయింది. తన కుడికాలి లిగమెంట్‌కు చీలిక రావడంతో ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా సర్జరీ చేయడంతో ఆమె కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రియను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల ఎనిమిదోతేదీన చేర్చించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్‌ చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం ఉందని ఆయన అంగీకరించారు.

- Advertisement -

వైద్యులు సర్జరీ బాగానే చేసినప్పటికీ కంప్రెషన్‌ బ్యాండేజీ గట్టిగా వేయడంతో రక్త ప్రసరణ నిలిచిపోయి వికటించిందన్నారు. ఈ సంఘటనలో ఇద్దరు డాక్టర్లను సస్పెండ్‌ చేస్తున్నామన్నారు. ప్రియ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్స్‌ చేస్తుంది. జాతీయ జట్టులో ఆమె రాణించాలని యత్నించింది. ఇటీవలె ఆరోగ్యమంత్రి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. కృత్రిమకాలును అమర్చుతామని హామి ఇచ్చారు. కానీ ఇంతలోనే ఆమె మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement