Sunday, May 5, 2024

కరోనా దెబ్బకు అక్కడ అన్నదానం బంద్…దేవాదాయ శాఖ ఉత్తర్వులు

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రతి రోజు కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా ను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నేటి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేశారు. అన్న ప్రసాదానికి బదులుగా భక్తులకు ఫుడ్ ప్యాకెట్లను అందించనున్నారు. కరుణ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే దేవాదాయ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement