Thursday, May 2, 2024

Nirmal: భైంసాను ముంచెత్తిన వరదనీరు..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని భైంసాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భైంసాను వరదనీరు ముంచెత్తింది. గడ్డెన్నవాగు నాలుగు గేట్లను అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భైంసాలోని ఆటో నగర్ లోకి వరదనీరు పోటెత్తింది. ఎస్ఆర్ గార్డెన్స్ లో వరదలో ఆరుగురు చిక్కుకున్నారు. బోటు ద్వారా వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భైంసా-బాసర రోడ్డుమార్గంపై వరదనీరు నిలిచింది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ముథోల్ గురుకుల పాఠశాల జలదిగ్భంధంలో చిక్కుకుంది. భైంసా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి పరీవాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement