Friday, May 10, 2024

లక్నో వెళ్లాల్సిన విమానం.. నాగపూర్​లో ఎమర్జెన్సీ ల్యాండింగ్​

54 మంది ప్రయాణికులతో లక్నో వెళ్తున్న ఇండిగో విమానం సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానం (6E 7074) గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి సోమవారం ఉదయం 7.45 గంటలకు బయలుదేరింది. ఉదయం 8.33 గంటల సమయంలో విమానం నుంచి పొగలు రావడాన్ని పైలట్ గుర్తించి నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు ఇండిగో యాజమాన్యం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement