Tuesday, May 7, 2024

Terror | ఐదుగురు టెర్రరిస్టుల హ‌తం.. జమ్మూ కాశ్మీర్‌లో ఘటన

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు టెర్రరిస్టులకు మధ్య హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ టెర్రరిస్టులు హతమైపోయారు. శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుందని కశ్మీర్‌ జోన్‌ ఏడీజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. టెర్రరిస్టులు దాగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) కు సమీపంలో జుమాగుండ్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు టెర్రరిస్టులు వారికి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఐదుగురు విదేశీ టెర్రరిస్టులు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement