Thursday, April 25, 2024

భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉదయం అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. భద్రతా బలగాలు ఉనికిని పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇక షోఫియాన్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో మసీదులో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement