Sunday, May 5, 2024

జపాన్ లో రోడ్డు ప్రమాదం – ఐదుగురు దుర్మరణం

జపాన్ లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.జపాన్‌ దేశ హక్కైడో పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ఐదుగురు మృతుల్లో బస్సు, ట్రక్కు డ్రైవర్లతో పాటు బస్సులోని ప్రయాణికులు కూడా ఉన్నారు. ఇంటర్‌సిటీ హైవే బస్సు 15 మంది ప్రయాణికులను సపోరో నుంచి హకోడేట్ నగరంలోని హాట్ స్ప్రింగ్ రిసార్ట్‌కు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement