Thursday, April 25, 2024

నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నల్గొండ జిల్లాలోని కట్టంగూరు సమీపంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ఈ ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ఘటనలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement