Wednesday, May 8, 2024

రోడ్డుప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రోడ్డుప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న చండీఘ‌డ్ రాష్ట్రంలోని లుథియానాలో చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు.. మొద‌ట‌గా డివైడ‌ర్‌ను ఢీకొని, ఆ త‌ర్వాత విద్యుత్తు స్తంభాన్ని బ‌లంగా ఢీకొట్టింది. చండీఘ‌డ్ రోడ్డులోని ఫోర్టిస్ హాస్పిట‌ల్ వ‌ద్ద కారు ముందు డివైడ‌ర్‌ను ఢీకొని ఆ త‌ర్వాత విద్యుత్తు పోల్‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో రాజేశ్‌, సంజ‌న‌, మ‌హి, కుషి, జాస్మిన్ ఉన్నారు. రాజేశ్ భార్య ప్రియా ప్ర‌స్తుతం క్రిస్టియ‌న్ మెడిక‌ల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement