Friday, April 26, 2024

నాంపల్లి వద్ద ‘చేప ప్రసాదం’.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన అధికారులు..

చేప ప్రసాదం నిర్వహణ దృష్ట్యా నాంపల్లిలోని నుమాయిష్ మైదానంలో ఇవ్వాల (గురువారం) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోజామ్ జాహీ మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి జీపీఓ అబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

అదే విధంగా, MJ బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుండి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అలస్కా వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ మొదలైన వాటి వైపు మళ్లిస్తారు. పీసీఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement