Sunday, April 28, 2024

గోదాంలో అగ్ని ప్రమాదం.. రూ.12ల‌క్ష‌ల నష్టం

కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న గోదాంలో శుక్రవారం తెల్లవారు జామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పారు. గోదాంలో గన్నీ బ్యాగులే ఉండడంతో అగ్ని కీలలకు సంచులన్నీ కాలి బూడిదయిపోయాయని అంచనా వేస్తున్నారు. సుమారు 40 వేల గన్నీ బ్యాగులు ఇందులో ఉన్నాయని, రూ. 12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గోదాం యజమానులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement