Friday, March 29, 2024

ISB ద్విదశాబ్ది వేడుక‌ల్లో పాల్గొన‌నున్న‌ చంద్రబాబు

గత 20 యేళ్ల క్రితం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నెలకొల్పిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇది 20 యేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు స్కూల్ అధికారులు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement