Friday, May 3, 2024

Fire – దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఒడిశాలో దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. నౌపడా జిల్లాలోని ఖరియార్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో రైలులోని బీ3 ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

బ్రేక్‌ ప్యాడ్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని చెప్పారు. బ్రేక్‌ ప్యాడ్‌ మినహా రైలుకు ఎలాంటి నష్టం జరుగలేదని స్పష్టం చేశారు. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. వాటిని ఆర్పివేశారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement