Saturday, May 4, 2024

తాటి చెట్టు పడి.. మహిళా కూలీ మృతి

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని సాహెబ్ గూడ గ్రామంలో వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీపైన తాటి చెట్టు పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం పోచారం గ్రామానికి చెందిన దాయి భాగ్యమ్మ(50) భర్త కొండయ్య రోజువారీగా వ్యవసాయ పనులకు వెళ్లింది. సాహెబ్ గూడ గ్రామంలో ఓ రైతు వ్యవసాయ పొలంలో వరినాట్లు వేస్తుండగా అదే పొలంలో ఉన్న తాటి చెట్టు ఈదురు గాలులకు కూలి ఆమెపైన పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement