Monday, April 29, 2024

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

యూపీలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 17 మంది గాయపడ్డారు. జాలౌన్ జిల్లాలోని గోపాల్‌పురా దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బస్సులోని మిగతా ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాధోగఢ్ పోలీసులు తెలిపారు. జైలౌన్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement