Thursday, March 28, 2024

రామాయంపేటలో కారు బీభత్సం.. మహిళ మృతి..

మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలో కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌ దగ్గర జనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన పండ్లు విక్రయించుకుంటున్న మహిళ మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement