Saturday, April 27, 2024

ఏందిరా ఈ పంచాయితీ.. టైటిల్ లోగో పోస్ట‌ర్ రిలీజ్

గ్రామీణ నేప‌థ్యంలో తెరకెక్క‌నుంది ఏందిరా ఈ పంచాయితీ మూవీ. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నాడు. గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంతో భరత్ .. విషిక .. లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే.. ఊరి వాతావరణం .. అందులో ఉండే గొడవలు చూపించనున్నట్టు అనిపిస్తోంది. కత్తెర .. కోడి .. బోరింగ్ .. తాటి చెట్లు వంటివి టైటిల్ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. అంటే ఒక ఊర్లో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, తేజ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. కెమెరామెన్‌గా సతీశ్ .. సంగీత దర్శకుడిగా రోహిత్ .. ఎడిటర్‌గా జేపీ వ్యవహరిస్తున్నారు. వెంకట్ – ప్రియాంక ఈ చిత్రానికి మాటలు అందించారు. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు అల‌రించ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement