Sunday, April 14, 2024

Breaking: ఆనం, మేకపాటి, శ్రీదేవి, కోటంరెడ్డిపై వేటు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. రాయలసీమకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి లను పార్టీ నుండి బహిష్కరిస్తూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపిన అనంతరమే వారిపై పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ చర్యలు తీసుకున్నారని ఆ పార్టీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెళ్లడించారు. పార్టీలో అంతర్గతంగా దర్యాప్తు జరిపామన్నారు. దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేపై వేటు వేసినట్లు సజ్జల తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement