Saturday, April 27, 2024

Breaking: బీజాపూర్ లో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. వాటిని సీజ్‌ చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement