Sunday, May 5, 2024

ట్విట్టర్ లో మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చిన ఎలాన్ మస్క్, పూర్తి వివరాలు ఇవే..

ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే ట్విట్టర్ లోనూ యూజర్లు తమ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించునే వెసులుబాటు కల్పించనున్నట్టు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇది కంటెంట్ క్రియేటర్లకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. భారీ టెక్ట్స్ కంటెంట్, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు సహా తమ కంటెంట్ పై యూజర్లు సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చని, తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని వివరించారు.

ట్విట్టర్ ఓపెన్ చేశాక సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజ్ అనే ఫీచర్ పై క్లిక్ చేస్తే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని మస్క్ తెలిపారు. ఈ మానిటైజేషన్ ఆప్షన్ ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులో ఉందని, త్వరలోనే మిగిలిన దేశాలకు కూడా వర్తింపజేస్తామని వెల్లడించారు. ఈ మానిటైజేషన్ ప్రోగ్రాం ద్వారా యూజర్లకు లభించే డబ్బులో 12 నెలల పాటు ట్విట్టర్ ఏమీ తీసుకోబోదని తెలిపారు. యూజర్లు ఎప్పుడు కావాలనుకున్నా తమ కంటెంట్ తో ట్విట్టర్ ను వీడవచ్చని మస్క్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement