Friday, May 3, 2024

Delhi | అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలి : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వివక్షకు గురవుతున్న జనం కోసం పోరాడిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కేంద్ర-రాష్ట్రాల సమన్వయకర్త బాల్‌రాజ్ నూనెతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం దత్తాత్రేయ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఉత్సాహంగా జరుపుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అయిన ఆయన దేశానికి దార్శనికుడని కొనియాడారు. విదేశాల్లో మూడు యూనివర్సిటీల్లో డాక్టరేట్ సంపాదించన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement