Sunday, May 19, 2024

National | మార్చి 13 తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్..

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 13 తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తొంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే షెడ్యూల్‌ విడుదల కానుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తరవాత యూపీ, జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది.

వ‌చ్చే నెల‌ మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకుని ఆ వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది ఈసీ. రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వరుస భేటీలు నిర్వహించి.. పలు ప్రాంతాల్లోని సమస్యలు, ఈవీఎమ్‌లు తరలించేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఇతరత్రా భద్రతా పరమైన సమస్యలపై చర్చిస్తొంది.

ఇక‌, ఈ సారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే వాటిని తొలగించేందుకు ఈ AI టీమ్‌ సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డివిజన్‌ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇలాంటి పోస్ట్‌లను తొలగించినప్పటికీ పదే పదే వాటిని ప్రచారం చేసినా… ఈసీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement