Thursday, May 2, 2024

12 న హైదరాబాద్‌కు రానున్న‌ ద్రౌపదీ ముర్ము.. స్వాగతానికి బీజేపీ సన్నాహాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : -ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌ రానున్నారు. 12 వ తేదీ మధ్యాహ్నం గం. 3 లకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ముర్ము అక్కడే బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యుడితో సమావేశం కానున్నారు.

అనంతరం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ద్రౌపదీ ముర్ము రాక సందర్భంగా భారీ స్వాగత ఏర్పాట్లకు బీజేపీ సన్నద్దమవుతోంది. ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు ఆదివారం జరుగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement