Sunday, May 5, 2024

త్వరలో ఓటీటీ వేదిక‌గా డిజే టిల్లు..

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజే టిల్లు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌‌గా మంచి కిక్కిచ్చింది. చిన్న సినిమానే అయినా బాక్సాఫీస్ వద్ద పెద్ద హంగామా చేసింది ఈ సినిమా. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు.. అయితే ఈ సినిమాను త్వరలో ఓటీటీ వేదికపైకి తీసుకొస్తున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్‌ పోస్టర్ రిలీజ్ చేసింది అహా.. ‘ఇగ టిల్లుగాడి లొల్లి ఆహాలో.. అతి త్వరలో’ అంటూ తెలుగు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. అయితే ఈ మూవీ ప్రసారం ఎప్పటినుంచి అనేది స్పష్టంగా చెప్ప‌లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement