Tuesday, May 7, 2024

కాంగ్రెస్‌ నేత పేరుతో ప్రెజర్‌ కుక్కర్ల పంపిణీ.. కేసు నమోదు

సిటీబ్యూరో, హైదరాబాద్ : ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత ఇంట్లో ఓటర్లకు పంచేందుకు పెద్ద మొత్తంలో సిద్ధంగా ఉన్న ప్రెజర్‌ కుక్కర్లను పోలీసులు సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోపాన్‌ పల్లి తండాలో.. రాములు నాయక్‌ ఇంట్లో గచ్చిబౌలి పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా 87 ప్రెజర్‌ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, రాములు నాయక్‌, నరసింహాలపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన ప్రెజర్‌ కుక్కర్లు శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ నేత రఘునాథ్‌ యాదవ్‌ కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement