Monday, April 29, 2024

దిగ్విజయ్ సింగ్ కు ఎంపీ కోమటిరెడ్డి ఫోన్..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు మరోపక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లు మరోవైపు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది రాజీనామాలు కూడా చేయడం జరిగింది.దీంతో తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం హై కమాండ్ దృష్టి దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో హై కమాండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నీ రంగంలోకి దింపడం జరిగింది.

ఈ సందర్భంగా దిగ్విజయ్ కాంగ్రెస్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి జరుగుతున్న పరిణామాల గురించి మొత్తం తెలుసుకున్నారు. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ కు పోన్ చేశారు. దిగ్విజయ్ సింగ్ ను అబ్జర్వర్ గా పంపండంపై హర్షం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ కు ఇక్కడి పరిస్థితులు తెలుసన్నారు. సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement