Wednesday, May 15, 2024

తిరుమలలో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 18 కంపార్టుమెంట్ల‌ భక్తులు వేచిఉన్నారు. ద‌ర్శ‌నానికి వీరికి 24 గంటల స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement