Saturday, May 18, 2024

సిమ్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ధర్నా

తిరుపతి సిటీ ప్రభ న్యూస్.. సిమ్స్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ బుధవారం సిమ్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 1998 నుంచి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వారి అర్హతను బట్టి పర్మినెంట్ చేయాలని కోరారు. ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు క్యాంటీన్లో కూడా రాయితీ ఇవ్వాలని తెలిపారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ వారి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 7 ను అమలు చేయాలని డిమాండ్ చేశారు… ఉద్యోగం చేసేటువంటి వారి కుటుంబ సభ్యులకు నెలలో ఒకసారి సుప్రభాత దర్శనం కల్పించడంతోపాటు. బ్రహ్మోత్సవాలు కానుక గా ఉద్యోగులకుఅందజేయాలని పేర్కొన్నారు.. కార్యక్రమంలో ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement