Friday, May 17, 2024

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

కర్నూలు నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పై వెళ్తున్న కారును లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన గనేశ్, రుద్ర, సోమ శేఖర్ గా గుర్తించారు. వీరు కర్నూలులోని తుంగభద్ర హోటల్ లో పని చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొని పరారైన లారీ కోసం సెర్చ్ చేస్తున్నామని తాలుకా సిఐ శేషయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement