Sunday, April 28, 2024

Shirdi | సాయి సన్నిధికి పోటెత్తిన భక్తులు.. గురుపౌర్ణమి కానుకగా ఏడు కోట్ల విరాళాలు

షిరిడీ (ప్రభ న్యూస్): గురు పౌర్ణ‌మి సంద‌ర్భంగా షిరిడీ సాయి స‌న్నిధికి భ‌క్తులు పోటెత్తారు. మూడు రోజుల‌పాటు విప‌రీత‌మైన క్రౌడ్ నెల‌కొంది. గ‌తంతో కంపేర్ చేస్తే ఈ సారి సాయి భ‌క్తుల రాక పెరిగింద‌ని అదే విధంగా విరాళాలు కూడా విపరీతంగా వచ్చినట్టు సాయి సంస్థాన్​ సీఈవో, ఐఏఎస్​ అధికారి పి.శివకుమార్​ తెలిపారు.

ఇక.. మూడు రోజుల గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా 7 కోట్ల రూపాయల విరాళాలు అందాయన్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు సాయి దర్శనం చేసుకున్నట్టు సీఈవో తెలిపారు. కాగా, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 3 కోట్ల రూపాయల విరాళాలు సంస్థాన్‌కు అధికంగా అందాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement